ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహన్ రావు కన్నుమూత!

ప్రముఖ కవి, విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు(75) మృతి చెందారు. అనారోగ్యం కారణంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై కవులు, రచయితలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటని అన్నారు. కాగా, అద్దేపల్లి రామ్మోహనరావు 1936 సెప్టెంబరు 6న కృష్ణా జిల్లా బందరు శివార్లలోని చింతగుంటపాలెంలో జన్మించారు.
Go Back to Shorts

More Telugu News