: గవర్నర్ తో జగన్ భేటీ... రైతు ఆత్మహత్యలు, దీక్షపై చర్చ

వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, నరసింహన్ తో పలు అంశాలపై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రైతు ఆత్మహత్యలు, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 7న తాను గుంటూరులో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్ష తదితర అంశాలపై ఆయన గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.

More Telugu News