: షీనా హత్య కేసు దర్యాప్తును మారియా కొనసాగిస్తారు : మహారాష్ట్ర సర్కార్ వివరణ

షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ముంబయి పోలీసు కమిషనర్ పదవి నుంచి ఈ రోజు బదిలీ అయిన రాకేష్ మారియానే కొనసాగిస్తారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మారియా బదలీ నేపథ్యంలో పలు విమర్శలు, అనుమానాలు తలెత్తిన విషయం తెలిసిందే. దర్యాప్తు నుంచి మారియాను తప్పించడంలో ఎటువంటి రాజకీయ కారణాలు లేవంటూ హోం శాఖ కార్యదర్శి ప్రకటన చేయడం కూడా జరిగింది. గణపతి ఉత్సవాల నేపథ్యంలో మారియాను బదలీ చేశామని మహారాష్ట్ర హోం శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.

More Telugu News