: హైదరాబాదులో ఆర్టీసీ బస్సు బీభత్సం... ఒకరు మృతి, పలువురికి గాయాలు

హైదరాబాదులో నేటి ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నగరంలోని వారాసిగూడలో స్పీడుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన మరుక్షణమే బస్సు దిగిన డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. బస్సు అదుపు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.

More Telugu News