: శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపటి క్రితమే దిగారు. తమిళనాడు నుంచి వచ్చిన ఆయన, ఇక్కడి నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వెళతారు. మధ్యాహ్నం 2.30గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో జరిగే సభకు హాజరవుతారు. అక్కడ ప్రసంగించిన అనంతరం రాహుల్ తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు.

More Telugu News