: లగడపాటికి భగత్ సింగ్ తో పోలికా..?: కోదండరాం
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేడు మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో పెప్పర్ స్ప్రే చేసిన విజయవాడ ఎంపీ లగడపాటిని సీమాంధ్రులు భగత్ సింగ్ తో పోల్చడం హాస్యాస్పదమన్నారు. అలా పోల్చితే భగత్ సింగ్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన లగడపాటి తన చర్యలతో ఆ ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేశాడని కోదండరాం విమర్శించారు. సీమాంధ్రుల ఆరాటమంతా ఆర్ధిక గుత్తాధిపత్యం కోసమేనని స్పష్టం చేశారు.