: యూపీఏ.. లంకతో సంబంధాలను తెంచుకోవాల్సిందే: వైగో


తమిళులపై దారుణాలకు ఒడిగడుతున్నశ్రీలంకకు, కేంద్రంలోని యూపీఏ మధ్యగల సంబంధాలపై ఎండీఎంకే నేత వైగో ధ్వజమెత్తారు. శ్రీలంకతో యూపీఏ ప్రభుత్వం నెరుపుతున్న స్నేహ పూరిత సంబంధాలను ఆయన ఈ సందర్భంగా తప్పుబట్టారు.

తక్షణమే ఆ దేశంతో ఉన్న బంధాలను తెంచుకోవాలని వైగో డిమాండు చేశారు. 2009లో ఎల్టీటీఈతో చివరి దశ పోరాటం సమయంలో లంకకు భారత సర్కారు సాయం చేస్తే.. ఫలితంగా లక్షలాది మంది తమిళులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా యూపీఏ కళ్లు తెరవాలని సూచించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News