స్పందనకు 10 అర్జీలు: విజ‌యవాడ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

విజ‌యవాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమము ద్వారా మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మేయ‌ర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి విభాగం – 1 మొత్తం 10 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉదయ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.

More Press News