బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి మృతిపట్ల హోం మంత్రి సంతాపం

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఛీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి బోడకుంటి విజయలక్ష్మి మృతి పట్ల హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బోడకుంటి విజయలక్ష్మి అకాల మరియు హఠాన్మరణం తనను చాలా కలచివేసిందని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

More Press News