'కుమారి 21 ఎఫ్' దర్శకుడి కొత్త చిత్రం ప్రారంభం
కుమారి 21ఎఫ్, 18 పేజీస్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్లో జరిగాయి. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో యూత్ ఆడియెన్స్ లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాతలు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ అందజేయగా నిర్మాత ఎస్ కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చి మూవీ టీమ్ కు తమ బెస్ట్ విశెస్ అందించారు.
ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమా నిర్మాణం కానుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమా నిర్మాణం కానుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.