సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్ ప్రసారం.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు!

హైదరాబాద్, 03 సెప్టెంబర్ 2025: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్ని ఇక నుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి.    నిండు నూరేళ్ల సావాసంపడమటి సంధ్యారాగంలక్ష్మీ నివాసంమేఘసందేశంజయంచామంతి సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయి

నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6 గంటలకుపడమటి సంధ్యారాగం 6:30 గంటలకులక్ష్మీ నివాసం రాత్రి 7 గంటలకుమేఘసందేశం 7:30 గంటలకుజయం 8 గంటలకుచామంతి 8:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ఈ నాన్ స్టాప్ సీరియల్ ఎంటర్టైన్మెంట్ ఈ వారం నుంచే ప్రారంభమవుతోంది. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ ఆరు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయి. మధ్యాహ్నం సీరియల్స్ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ ఆదివారం నుంచి వారం వారం నాన్స్టాప్ సీరియల్స్ ఆస్వాదించేందుకు మీరూ సిద్ధంకండి!

 

అదరగొడుతున్న జీ తెలుగు సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా..  సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, తప్పక చూడండి!


More Press Releases