Rishabh Shetty: సంక్రాంతి బరిలోకి దిగుతున్న 'కాంతార' ప్రీక్వెల్

  • 2022లో విడుదలైన 'కాంతార'
  • 16 కోట్లతో 450 కోట్లు రాబట్టిన సినిమా 
  • ప్రీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • గట్టిపోటీని ఎదుర్కోనున్న రిషభ్ శెట్టి

kanthara Movie Twitter

రిషభ్ శెట్టి కథానాయకుడిగా రూపొందిన 'కాంతార' 2022 సెప్టెంబర్ 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. కన్నడలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. తెలుగులో కూడా ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కొంత కాలంగా అందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగినట్టుగానే అన్నింటినీ ప్లాన్ చేసుకుంటున్నారు. 'కాంతార' కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగింది అనే దాని దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది. 

'కాంతార' సినిమాను కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అలాంటి ఈ సినిమా మిగతా భాషల్లోను కలుపుకుని, 450 కోట్ల వరకూ సంపాదించింది. అందువలన ప్రీక్వెల్ కి కాస్త గట్టిగానే ఖర్చు చేస్తున్నారు. 'కాంతార' ఫస్టు మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సంక్రాంతికి తెలుగులో గట్టి పోటీ ఉంటుంది. 

More Telugu News