పటికబెల్లంతో చేసిన శివలింగ పూజా ఫలితం

పరమశివుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. ఆ స్వామిని లింగాకారంలోనే ప్రతిష్ఠించుకుని భక్తులు పూజించుకుంటూ వుంటారు. శివలింగాన్ని అభిషేకించడం వలన .. శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందని అంటున్నాయి.

గంధంతోను .. పిండితోను .. కర్పూరంతోను చేసిన శివలింగాలను పూజించడం వలన వివిధ రకాల ఫలితాలు దక్కుతాయి. అలాగే 'పటిక బెల్లం'తో చేసిన శివలింగాన్ని పూజించడం వలన, వివిధ రకాల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తమకి ఆరోగ్యాన్ని ప్రసాదించమనే భగవంతుడిని కోరుకుంటూ వుంటారు. ఎందుకంటే అనారోగ్యాలు జీవితాన్ని సతమతం చేస్తాయి .. మానసికంగాను కుంగదీస్తాయి. అందువలన అనారోగ్యాలతో బాధలుపడేవారు, పటిక బెల్లంతో చేసుకున్న శివలింగాన్ని పూజించడం వలన వాటి నుంచి విముక్తి లభిస్తుందనేది ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తోంది.    


More Bhakti News