గుజరాత్లో దారుణం: భార్య నచ్చలేదని రూ.50 వేలకు అమ్మేసిన భర్త
- మిస్సింగ్ డ్రామాతో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
- భర్తతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- బాధితురాలిపై లైంగిక దాడి, నగల దోపిడీ
- టెక్నికల్ సర్వైలెన్స్తో కేసును ఛేదించిన అధికారులు
గుజరాత్లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య నచ్చలేదనే కారణంతో కట్టుకున్న భర్తే ఆమెను రూ.50 వేలకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటనలో బాధితురాలి భర్త నిఖేష్భాయ్ పటేల్తో పాటు మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బనస్కాంత జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం మే 11న నిందితుడు నిఖేష్ పటేల్ తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే, రెండు రోజుల తర్వాత నిఖేష్ కూడా అదృశ్యం కావడంతో అతడి తండ్రి మరో ఫిర్యాదు చేశారు. ఈ వరుస పరిణామాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో లోతైన దర్యాప్తు చేపట్టారు.
టెక్నికల్ సర్వైలెన్స్, మానవ వనరుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు నిఖేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తన భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే స్నేహితులైన సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్ల సహాయంతో అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుల చెర నుంచి బాధితురాలిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. తనను అమ్మేసిన తర్వాత ఒకచోట బంధించి, నిరంతరం లైంగిక దాడి చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా, తన బంగారు ఆభరణాలను లాక్కొని అమ్మేశారని తెలిపింది. ఈ కేసులో పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్కు ఇదివరకే పెళ్లయిందని, ఇతర మహిళలను లోబరుచుకోవడం, కిడ్నాప్ చేయడం వంటి నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం మే 11న నిందితుడు నిఖేష్ పటేల్ తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే, రెండు రోజుల తర్వాత నిఖేష్ కూడా అదృశ్యం కావడంతో అతడి తండ్రి మరో ఫిర్యాదు చేశారు. ఈ వరుస పరిణామాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో లోతైన దర్యాప్తు చేపట్టారు.
టెక్నికల్ సర్వైలెన్స్, మానవ వనరుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు నిఖేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తన భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే స్నేహితులైన సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్ల సహాయంతో అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుల చెర నుంచి బాధితురాలిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. తనను అమ్మేసిన తర్వాత ఒకచోట బంధించి, నిరంతరం లైంగిక దాడి చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా, తన బంగారు ఆభరణాలను లాక్కొని అమ్మేశారని తెలిపింది. ఈ కేసులో పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్కు ఇదివరకే పెళ్లయిందని, ఇతర మహిళలను లోబరుచుకోవడం, కిడ్నాప్ చేయడం వంటి నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.