Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటం, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో శనివారం ఆయన టీటీడీ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, భక్తుల విశ్వాసాన్ని మరింతగా చూరగొనేలా, పారదర్శకమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.
సాంకేతికతతో సామాన్యులకు పెద్దపీట
సామాన్య భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. టెక్నాలజీ సహాయంతో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించి, వారికి సులభంగా, త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించాలని ఆదేశించారు. ఇది భక్తులపై మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, దర్శన ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రసాదం నాణ్యతలో రాజీ వద్దు
శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి, ఇతర ముడి సరుకుల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్ను పటిష్టంగా నిర్వహించాలని, కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. తాను స్వయంగా కొందరు భక్తులను కలిసినప్పుడు వారు ప్రసాదం నాణ్యతపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, ఆ నమ్మకాన్ని నిరంతరం కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.
పేదలకు అండగా సేవలు.. ధర్మప్రచారానికి పెద్దపీట
"పేదల సేవయే భగవంతుని సేవ" అనే స్ఫూర్తితో టీటీడీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ వంటి వైద్య సంస్థల ద్వారా అందిస్తున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అరుదైన వ్యాధులతో బాధపడే పేద రోగుల చికిత్స కోసం ప్రాణదానం ట్రస్ట్ ద్వారా నెలకు అదనంగా రూ.1 కోటి నిధులను సమకూరుస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
దివంగత ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన అన్నదానం కార్యక్రమాన్ని టీటీడీ పరిధిలోని 57 ఆలయాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారని, త్వరలోనే మరో 4 ఆలయాల్లో ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రధాన దేవాలయాల్లో కూడా అమలు చేసేలా చూడాలని సీఎం సూచించారు.
ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్ల వ్యయంతో 5,000 నూతన ఆలయాల నిర్మాణ ప్రణాళికను ముఖ్యమంత్రి సమీక్షించారు. అంతేకాకుండా, దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఆలయాలు నిర్మించే ప్రతిపాదనలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలి
తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 17.12 లక్షల మంది సేవకులు తమ సేవలను అందించారని, సాధారణ రోజుల్లో 3000 మంది, రద్దీ రోజుల్లో 4000 మంది వరకు సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారని అధికారులు సీఎంకు వివరించారు. అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ వంటి కీలక విభాగాల్లో వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికతతో సామాన్యులకు పెద్దపీట
సామాన్య భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. టెక్నాలజీ సహాయంతో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించి, వారికి సులభంగా, త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించాలని ఆదేశించారు. ఇది భక్తులపై మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, దర్శన ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రసాదం నాణ్యతలో రాజీ వద్దు
శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి, ఇతర ముడి సరుకుల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్ను పటిష్టంగా నిర్వహించాలని, కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. తాను స్వయంగా కొందరు భక్తులను కలిసినప్పుడు వారు ప్రసాదం నాణ్యతపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, ఆ నమ్మకాన్ని నిరంతరం కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.
పేదలకు అండగా సేవలు.. ధర్మప్రచారానికి పెద్దపీట
"పేదల సేవయే భగవంతుని సేవ" అనే స్ఫూర్తితో టీటీడీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ వంటి వైద్య సంస్థల ద్వారా అందిస్తున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అరుదైన వ్యాధులతో బాధపడే పేద రోగుల చికిత్స కోసం ప్రాణదానం ట్రస్ట్ ద్వారా నెలకు అదనంగా రూ.1 కోటి నిధులను సమకూరుస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
దివంగత ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన అన్నదానం కార్యక్రమాన్ని టీటీడీ పరిధిలోని 57 ఆలయాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారని, త్వరలోనే మరో 4 ఆలయాల్లో ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రధాన దేవాలయాల్లో కూడా అమలు చేసేలా చూడాలని సీఎం సూచించారు.
ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్ల వ్యయంతో 5,000 నూతన ఆలయాల నిర్మాణ ప్రణాళికను ముఖ్యమంత్రి సమీక్షించారు. అంతేకాకుండా, దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఆలయాలు నిర్మించే ప్రతిపాదనలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలి
తిరుమల కొండపై శ్రీవారి సేవకుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 17.12 లక్షల మంది సేవకులు తమ సేవలను అందించారని, సాధారణ రోజుల్లో 3000 మంది, రద్దీ రోజుల్లో 4000 మంది వరకు సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారని అధికారులు సీఎంకు వివరించారు. అన్నదానం, క్యూలైన్ల నిర్వహణ వంటి కీలక విభాగాల్లో వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
