Shimla: మనిషి కాలుతో కుక్క సంచారం.. విచారణలో తేలిన షాకింగ్ నిజాలు!
- సిమ్లాలో మనిషి కాలు నోట కరుచుకుని తిరుగుతున్న కుక్క వీడియో కలకలం
- ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్టు విచారణలో వెల్లడి
- ఆపరేషన్లో తొలగించిన కాలును స్టోర్ రూమ్లో ఉంచి తాళం వేయని సిబ్బంది
- ఈ ఘటనపై శానిటేషన్ సూపర్వైజర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
సిమ్లాలో ఓ వీధికుక్క మనిషి కాలును నోట కరుచుకుని తిరుగుతున్న షాకింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు జరిపిన విచారణలో ఆసుపత్రి సిబ్బంది ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వైద్య వ్యర్థాల నిర్వహణలో జరిగిన తీవ్రమైన తప్పిదం వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తేలింది.
వివరాల్లోకి వెళితే.. సిమ్లాలోని చమియానాలో ఉన్న అటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో గత గురువారం అత్తర్ సింగ్ (61) అనే వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు. ఆ కాలును ఒక కవర్లో ఉంచి ఆసుపత్రిలోని స్టోర్ రూమ్లో పెట్టారు. దానిని నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాలని శానిటేషన్ ఏజెన్సీకి సూచించారు.
అయితే, ఈ నెల 22న సిబ్బంది ఆ స్టోర్ రూమ్కు తాళం వేయడం మర్చిపోయారు. దీంతో లోపలికి ప్రవేశించిన ఓ వీధికుక్క, అక్కడ ఉన్న కాలును నోట కరుచుకుని బయటకు వెళ్లిపోయింది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్క మనిషి కాలుతో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం నిజమని తేలడంతో ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ శానిటేషన్ సూపర్వైజర్తో పాటు ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. సిమ్లాలోని చమియానాలో ఉన్న అటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో గత గురువారం అత్తర్ సింగ్ (61) అనే వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు. ఆ కాలును ఒక కవర్లో ఉంచి ఆసుపత్రిలోని స్టోర్ రూమ్లో పెట్టారు. దానిని నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాలని శానిటేషన్ ఏజెన్సీకి సూచించారు.
అయితే, ఈ నెల 22న సిబ్బంది ఆ స్టోర్ రూమ్కు తాళం వేయడం మర్చిపోయారు. దీంతో లోపలికి ప్రవేశించిన ఓ వీధికుక్క, అక్కడ ఉన్న కాలును నోట కరుచుకుని బయటకు వెళ్లిపోయింది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్క మనిషి కాలుతో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం నిజమని తేలడంతో ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ శానిటేషన్ సూపర్వైజర్తో పాటు ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.