బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని కవితనే చెప్పారు: పొన్నం ప్రభాకర్
- కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నమంత్రి
- సింగరేణిపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చ పెడితే బహిష్కరించి వెళ్లిపోయారన్న మంత్రి
గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లను అప్పగించిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు ఇప్పుడు వారికి చెడ్డవారయ్యారా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై కూడా బీఆర్ఎస్ నాయకులు ఇలాగే ఆరోపణలు చేశారని, అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇస్తే బహిష్కరించి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు.