Gantela Sumana: పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన కన్నుమూత
- విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే సుమన మృతి
- 1983లో టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం
- ఆమె మృతి పట్ల పలువురు నేతలు, కార్యకర్తలు సంతాపం
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత గంటెల సుమన (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో పాయకరావుపేట నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గంటెల సుమన 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట (ఎస్సీ రిజర్వ్డ్) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన పదవీకాలంలో 1984లో నక్కపల్లిలో బాలికల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
సుమన మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని విశాఖ అక్కయ్యపాలెంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో ఉంచారు. ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గంటెల సుమన 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట (ఎస్సీ రిజర్వ్డ్) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన పదవీకాలంలో 1984లో నక్కపల్లిలో బాలికల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
సుమన మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని విశాఖ అక్కయ్యపాలెంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో ఉంచారు. ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.