సినిమా టికెట్ల రేట్లపై కీలక సమావేశం.. ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఏమన్నారంటే..!
- సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులతో కందుల దుర్గేశ్ సమావేశం
- అప్పటికప్పుడు ధరలు పెంచుకోకుండా సమగ్ర విధానాన్ని తీసుకొస్తామన్న మంత్రి
- ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్య
సినిమా విడుదలైన ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని దుర్గేశ్ తెలిపారు. ప్రతిసారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒకే జీవో ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.