Sudhanshu Dhulia: ఏపీ-కర్ణాటక సరిహద్దు వివాదం.. గనుల ప్రాంతాన్ని పరిశీలించిన జస్టిస్‌ ధూలియా

Sudhanshu Dhulia Committee Inspects AP Karnataka Border Mining Areas
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు గనుల వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని ఈ కమిటీ నిన్న అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించింది.

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం, అక్రమ మైనింగ్, అటవీ ప్రాంతంలో తవ్వకాలపై వాస్తవాలను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబరులో జస్టిస్ ధూలియా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ నెల 19వ తేదీన సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన జస్టిస్ ధూలియా, మండల పరిధిలోని ఆరు మైనింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

గత 20 రోజులుగా రెవెన్యూ, సర్వే, అటవీ, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వే పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన సరిహద్దుల మేరకే తవ్వకాలు జరిగాయా? లేక హద్దులు మీరారా? అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. పర్యటనకు ముందు ఆయన బళ్లారిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధికారులతో సమావేశమై గతంలో జరిగిన మైనింగ్ కార్యకలాపాలు, వివాదాల గురించి చర్చించారు.

ఆయన వెంట సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కూర్మనాథ్, సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 
Go Back to Shorts
Sudhanshu Dhulia
AP Karnataka border dispute
interstate border issue
mining areas
Anantapur district
illegal mining
Supreme Court committee
mines survey
Ballari
Kurnath Director

More Telugu News