Indigo Airlines: కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం... హైదరాబాదులో మరో 112 విమానాలు రద్దు
- హైదరాబాద్ విమానాశ్రయంలో ఏడో రోజూ తప్పని ఇండిగో కష్టాలు
- సోమవారం ఒక్కరోజే 112 విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ
- వారం రోజుల్లో 600కు పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు
- కొత్త FDTL నిబంధనలే సంక్షోభానికి కారణమంటున్న ఇండిగో యాజమాన్యం
- డిసెంబర్ 15 వరకు బుకింగ్లపై రద్దు, రీషెడ్యూలింగ్ ఛార్జీల నుంచి మినహాయింపు
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ఏడో రోజైన సోమవారం కూడా ఇండిగో సంస్థ ఏకంగా 112 విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో 600కు పైగా విమానాలను రద్దు చేసింది. ఆదివారం 126 సర్వీసులు రద్దు కాగా, డిసెంబర్ 5న అత్యధికంగా 155 విమానాలను నిలిపివేసింది. వరుసగా ఐదో రోజు రద్దయిన విమానాల సంఖ్య 100 దాటడం గమనార్హం. విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సిబ్బందిని సంప్రదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఇండిగో చెబుతోంది. ఈ నిబంధనల ప్రకారం పైలట్ల విశ్రాంతి సమయం పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.
మరోవైపు, ప్రయాణికులకు కాస్త ఊరటనిస్తూ డిసెంబర్ 15 వరకు చేసుకున్న బుకింగ్లకు సంబంధించి విమానాల రద్దు, రీషెడ్యూలింగ్పై ఎలాంటి అదనపు రుసుములు ఉండవని ఇండిగో ప్రకటించింది. కాగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ ఈ నిబంధనల నుంచి ఫిబ్రవరి 10 వరకు తాత్కాలిక సడలింపులు ఇచ్చింది.
డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో 600కు పైగా విమానాలను రద్దు చేసింది. ఆదివారం 126 సర్వీసులు రద్దు కాగా, డిసెంబర్ 5న అత్యధికంగా 155 విమానాలను నిలిపివేసింది. వరుసగా ఐదో రోజు రద్దయిన విమానాల సంఖ్య 100 దాటడం గమనార్హం. విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సిబ్బందిని సంప్రదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఇండిగో చెబుతోంది. ఈ నిబంధనల ప్రకారం పైలట్ల విశ్రాంతి సమయం పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.
మరోవైపు, ప్రయాణికులకు కాస్త ఊరటనిస్తూ డిసెంబర్ 15 వరకు చేసుకున్న బుకింగ్లకు సంబంధించి విమానాల రద్దు, రీషెడ్యూలింగ్పై ఎలాంటి అదనపు రుసుములు ఉండవని ఇండిగో ప్రకటించింది. కాగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ ఈ నిబంధనల నుంచి ఫిబ్రవరి 10 వరకు తాత్కాలిక సడలింపులు ఇచ్చింది.