ప్రపంచం మందగమనం గురించి మాట్లాడుతున్న తరుణంలో మనం వృద్ధి దిశగా పయనిస్తున్నాం: మోదీ
- ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారన్న ప్రధానమంత్రి
- భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర పెరిగిందన్న నరేంద్ర మోదీ
- భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని వెల్లడి
వలస పాలన నాటి మూలాలను పూర్తిగా వదిలించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి ఇంజిన్గా భారత్ ఎదుగుతోందని మోదీ పేర్కొన్నారు. 2025లో ప్రభుత్వం సాధించిన మైలురాళ్లలో ప్రత్యక్ష పన్ను వ్యవస్థలో భారీ సంస్కరణలు ఒకటని ఆయన అన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదని గుర్తు చేశారు.