Hyderabad Software Engineer: విశాఖ లాడ్జిలో తల్లి, టెకీ కుమారుడి ఆత్మహత్య..
- సింహాచలం లాడ్జిలో ఉరి వేసుకున్న వైనం
- మృతుడు హైదరాబాద్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
- 498ఏ కేసు కారణంగానే బలవన్మరణం అని అనుమానం
విశాఖ నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాచలంలో ఒక ప్రైవేట్ లాడ్జిలో తల్లి, కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గాజువాకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడికి 2021లో వివాహం కాగా, భార్య పెట్టిన కేసు కారణంగా హైదరాబాద్లో 498ఏ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో మనస్తాపానికి గురై, తల్లితో కలిసి బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడికి 2021లో వివాహం కాగా, భార్య పెట్టిన కేసు కారణంగా హైదరాబాద్లో 498ఏ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో మనస్తాపానికి గురై, తల్లితో కలిసి బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.