ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతమ్ ఆదానీ భేటీ
- అమరావతిలో జరిగిన ఈ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
- రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై చర్చించిన నేతలు
- ఏపీలో కొత్త పెట్టుబడుల ప్రణాళికపై కీలక సమీక్ష
ఈ భేటీకి సంబంధించిన వివరాలను మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఎండీ కరణ్ అదానీలతో అమరావతిలో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న అదానీ గ్రూప్ ప్రాజెక్టులతో పాటు, రాష్ట్ర భవిష్యత్ వృద్ధి కోసం వారు ప్రణాళిక చేస్తున్న కొత్త పెట్టుబడుల గురించి చర్చించాము," అని లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.