విశాఖలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
- కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
- హాజరైన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రామకృష్ణబాబు
- రూ. 7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం
ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును వినియోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు. 250 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకేసారి 40 మంది ఎక్కవచ్చు.
ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ... పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకుని నిలబడేలా గ్లాస్ బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. కైలాసగిరిపై త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.