మా పంచసూత్రాలు చూసి జగన్ ఏడుస్తున్నారు: మంత్రి అనగాని
- జగన్కు కుట్రలు, ఈర్ష్య పెరిగిపోయాయన్న మంత్రి అనగాని
- కూటమి పాలనలో రైతుల సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శ
- పంచసూత్రాలతో రైతులను ప్రపంచ మార్కెట్తో పోటీపడేలా చేస్తామని వ్యాఖ్య
ప్రభుత్వం రైతుల సాధికారత కోసం 'పంచసూత్రాలు' అమలు చేస్తుంటే, వారి మంచిని చూడలేక జగన్ ఏడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవని, వారిని ఆత్మహత్యల వైపు నెట్టారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలే ఆయన పాలనకు నిదర్శనమని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని అనగాని భరోసా ఇచ్చారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో పోటీ పడే స్థాయికి ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. రైతుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతుంటే, జగన్ ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.