50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై యనమల కీలక వ్యాఖ్యలు
- రిజర్వేషన్ల పరిమితిపై యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు
- 50 శాతం పరిమితి దాటేందుకు రాజ్యాంగ సవరణ అవసరం
- ఇదే నిజమైన సామాజిక న్యాయమని స్పష్టీకరణ
ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు యనమల విజ్ఞప్తి చేశారు. సమాజంలో అసమానతలను రూపుమాపడంలో ప్రభుత్వాల పాత్ర కీలకమని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని సూచించారు.
ఈ రెండు రంగాలను బలోపేతం చేయడం వల్ల మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని, తద్వారా ప్రజల మధ్య ఆర్థిక, విద్య, ఆరోగ్యపరమైన అంతరాలు తగ్గుముఖం పడతాయని యనమల వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి దిశగా ప్రభుత్వాలు ఈ అంశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.