హైదరాబాద్లో జగన్ తీరు న్యాయవ్యవస్థను హేళన చేసేలా ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర
- అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన జగన్
- జగన్ కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేశారన్న కొల్లు రవీంద్ర
- జగన్ వంటి ఆర్థిక నేరస్థుడి వెనుక నడిచే వారు ఆలోచించాలని సూచన
సుమారు రూ.43 వేల కోట్ల అవినీతిని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు కోర్టుకు హాజరవుతూ బలప్రదర్శన చేయడం సిగ్గుచేటని అన్నారు. భారీ ఊరేగింపులు, ర్యాలీలతో కోర్టుకు ఎవరైనా హాజరవుతారా? అని ప్రశ్నించారు. అలా చేయడం న్యాయస్థానాలను అవమానించిడమేనని అన్నారు. 'రఫ్పా రఫ్పా' అంటూ బ్యానర్లతో ర్యాలీ తీయడం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
జగన్ వంటి ఆర్థిక నేరస్థుడి వెనుక నడిచేవారు ఇప్పటికైనా ఆలోచించాలని సూచించారు. క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలతో ప్రజల ఆస్తులను జగన్ కొల్లగొట్టారని ఆరోపించారు. తప్పు చేసినవారు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.