నిందితుడికి ఉరిశిక్ష... సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్ జిల్లా కోర్టు
- 2019లో భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసిన ప్రవీణ్
- నేరం తీవ్రత, ఆధారాలను పరిశీలించి ఉరిశిక్ష విధించిన కోర్టు
- ఇనుప రాడ్డుతో భార్య, కుమార్తెను చంపి, కుమారుడిని గొంతు నులిమి చంపిన ప్రవీణ్
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రవీణ్ ఆరేళ్ల క్రితం ఈ హత్యలకు పాల్పడ్డాడు. మొదట భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆమెను, ఐదేళ్ల కుమార్తెను ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రవీణ్, ఆ తరువాత మనసు మార్చుకుని పోలీసులకు లొంగిపోయాడు.