జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కారణాలివే: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్
- అభ్యర్థి పట్ల సానుభూతి, మజ్లిస్ మద్దతు, అజారుద్దీన్కు మంత్రి పదవి వల్ల గెలిచిందన్న బీజేపీ నేత
- వచ్చేసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా
- 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ప్రజలు విస్మరించారని భావించరాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా తమ పార్టీ బలపడుతోందని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లో పార్టీ గెలుపు లేదా ఓటమి అనేది పార్టీలోని ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన గణాంకాలను వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆయన కోరారు. ఈ విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని ఆయన అన్నారు. దేశంలో ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే న్యాయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.