కౌంటింగ్ వేళ తేజస్వీ ధీమా.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు
- కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
- మార్పు ఖాయమని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య
- రాఘోపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్న తేజస్వీ
- ఎన్డీయే గెలుస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేసిన విపక్ష కూటమి
మహాఘట్బంధన్ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళి ప్రకారం, ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బీహార్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 67.13 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. అధికార ఎన్డీయే కూటమికే మళ్లీ పట్టం కట్టాయి. కానీ, ఈ అంచనాలను ప్రతిపక్షాలు మొదటి నుంచి తోసిపుచ్చుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు ఉంటాయని, ప్రజలు మార్పు కోరుకున్నారని విపక్ష నేతలు వాదిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో పూర్తి ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.