జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన నటుడు గోపీచంద్
- సిరా గుర్తును మీడియాకు చూపించిన గోపీచంద్
- యూసఫ్గూడలో ఓటు వేసిన తనికెళ్ల భరణి
- జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రోన్లతో పర్యవేక్షణ
నియోజకవర్గంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సాంకేతికతను వినియోగిస్తూ నియోజకవర్గంలో తొలిసారిగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తెలిసేలా 136 డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు.