Gopichand Hinduja: గోపీచంద్ హిందూజా మృతిపై మంత్రి నారా లోకేశ్ స్పందన

Nara Lokesh Expresses Grief Over Gopichand Hinduja Demise
  • ప్రముఖ పారిశ్రామికవేత్త గోపీచంద్ హిందూజా కన్నుమూత
  • ఏపీ మంత్రి నారా లోకేశ్ సంతాపం
  • పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆయన ముద్ర చెరగనిదని వెల్లడి
  • ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవలు చిరస్మరణీయం అంటూ వివరణ 
  • హిందూజా కుటుంబంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్న లోకేశ్ 
ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందూజా గ్రూప్ ఛైర్మన్  గోపీచంద్ పి హిందూజా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా చెరగని ముద్ర వేశాయని కొనియాడారు. ఈ మేరకు లోకేశ్ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు.

"జీపీ హిందూజా గారి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. పారిశ్రామిక, సేవా రంగాలకు ఆయన అందించిన విశేషమైన సేవలు ప్రపంచవ్యాప్తంగా శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాయి" అని లోకేశ్ పేర్కొన్నారు. హిందూజా కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతోకాలంగా ఒక ప్రత్యేకమైన, మధురమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

"మా రెండు కుటుంబాల మధ్య పరస్పర గౌరవం, స్నేహం ఆధారంగా బలమైన బంధం ఉంది. ఈ తీవ్రమైన నష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను" అని నారా లోకేశ్ తన సందేశంలో వివరించారు.
Gopichand Hinduja
Nara Lokesh
Hinduja Group
Andhra Pradesh
Industrialist
Social Service
Condolences
Obituary
Business
India

More Telugu News