Nalla Cheruvu: హైడ్రా చొరవ.. విహార కేంద్రంగా మారిన కూకట్పల్లి నల్లచెరువు
- కూకట్పల్లి నల్లచెరువుకు హైడ్రా ఆధ్వర్యంలో కొత్త అందాలు
- ఆరు నెలల్లో 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరణ
- చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
- వాకింగ్ ట్రాక్, సీసీ కెమెరాలు, ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
- స్థానికులకు ఆహ్లాదం పంచుతున్న చెరువు.. వారాంతాల్లో సందర్శకుల రద్దీ
- బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదిక, నిమజ్జనం కుంట ఏర్పాటు
ఒకప్పుడు ఆక్రమణలు, నిర్మాణ వ్యర్థాలతో మురికికూపంగా ఉన్న కూకట్పల్లి నల్లచెరువు ఇప్పుడు సరికొత్తగా జలకళను సంతరించుకుంది. హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులతో ఈ చెరువు కూకట్పల్లికే మణిహారంలా మారింది. కేవలం ఆరు నెలల వ్యవధిలో చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయి, స్థానికులకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా మారింది.
ఆదివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నల్లచెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రతను పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాలు, పిల్లలు ఆడుకునేందుకు రెండు ప్లే ఏరియాలు, పెద్దలు సేద తీరేందుకు విశ్రాంతి మందిరాలు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో ఔషధ మొక్కలు నాటి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఆక్రమణలతో 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువును హైడ్రా అధికారులు రెవెన్యూ రికార్డుల ఆధారంగా 30 ఎకరాల వరకు విస్తరించారు. చెరువు పరిధిలోని 16 వ్యాపార షెడ్లను తొలగించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక, చెత్తను పూర్తిగా తొలగించడంతో చెరువు లోతు 4 మీటర్ల మేర పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
హైడ్రా కృషితో చెరువు రూపురేఖలు మారిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో ఈ ప్రాంతం పిక్నిక్ స్పాట్గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వందలాది మంది ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. చెరువు పక్కనే బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదికను, నిమజ్జనం కోసం ఒక చిన్న కుంటను కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.
ఆదివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నల్లచెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రతను పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాలు, పిల్లలు ఆడుకునేందుకు రెండు ప్లే ఏరియాలు, పెద్దలు సేద తీరేందుకు విశ్రాంతి మందిరాలు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో ఔషధ మొక్కలు నాటి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఆక్రమణలతో 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువును హైడ్రా అధికారులు రెవెన్యూ రికార్డుల ఆధారంగా 30 ఎకరాల వరకు విస్తరించారు. చెరువు పరిధిలోని 16 వ్యాపార షెడ్లను తొలగించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక, చెత్తను పూర్తిగా తొలగించడంతో చెరువు లోతు 4 మీటర్ల మేర పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
హైడ్రా కృషితో చెరువు రూపురేఖలు మారిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో ఈ ప్రాంతం పిక్నిక్ స్పాట్గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వందలాది మంది ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. చెరువు పక్కనే బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదికను, నిమజ్జనం కోసం ఒక చిన్న కుంటను కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.