India vs Australia: రెండో టీ20లో టాస్ గెలిచిన ఆసీస్‌.. భారత్ బ్యాటింగ్

Australia win the toss and bowl first
  • మెల్‌బోర్న్‌లో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్‌
  • తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయ‌ని టీమిండియా
  • ఆసీస్ జట్టులోకి మ్యాట్ షార్ట్.. ఫిలిప్‌కు విశ్రాంతి
  • దూకుడుగా ఆడటమే తమ లక్ష్యమన్న‌ భారత కెప్టెన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జాష్ ఫిలిప్ స్థానంలో ఆల్‌రౌండర్ మ్యాట్ షార్ట్‌ను జట్టులోకి తీసుకుంది. మరోవైపు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

టాస్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పారు. "మేం అనుసరించాలనుకుంటున్న క్రికెట్ బ్రాండ్ ఇదే. బరిలోకి దిగిన వెంటనే దూకుడుగా ఆడాలి. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే ఆ టోన్ సెట్ చేస్తున్నారు. గిల్‌కు పరుగులు ఎలా చేయాలో బాగా తెలుసు. అతనితో కలిసి వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తాల్సి ఉంటుంది" అని సూర్య అన్నాడు.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జాష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచ్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మ్యాట్ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాట్ కునెమాన్, జాష్ హేజిల్‌వుడ్.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
India vs Australia
Suryakumar Yadav
T20 Match
Melbourne
Cricket
Shubman Gill
Travis Head
Mitchell Marsh
Jasprit Bumrah
Indian Cricket Team

More Telugu News