Kabir Mondal: బెంగళూరు ఆలయంలో దారుణం.. విగ్రహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి
- దేవరబిసనహళ్లి వేణుగోపాల స్వామి ఆలయంలో ఘటన
- మద్యం మత్తులో దుశ్చర్యకు పాల్పడిన కబీర్ మొండల్
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
- నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడిగా అనుమానం
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి దేవుడి విగ్రహాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన బెంగళూరు దేవరబిసనహళ్లిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన స్థానికులు, భక్తులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం నిందితుడిని 45 ఏళ్ల కబీర్ మొండల్గా గుర్తించారు. అతడిని బంగ్లాదేశ్ జాతీయుడిగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కబీర్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. "అతడు మతపరమైన భావాలు కలిగిన వ్యక్తి. మద్యం మత్తులో చెప్పులతోనే ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తన చెప్పు తీసి గర్భగుడిలోని విగ్రహాలను కొట్టడానికి ప్రయత్నించాడు" అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ అపచారాన్ని గమనించిన భక్తులు, స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో అతడిపై దాడి చేసి, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి జాతీయత, నేపథ్యంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం నిందితుడిని 45 ఏళ్ల కబీర్ మొండల్గా గుర్తించారు. అతడిని బంగ్లాదేశ్ జాతీయుడిగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కబీర్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. "అతడు మతపరమైన భావాలు కలిగిన వ్యక్తి. మద్యం మత్తులో చెప్పులతోనే ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తన చెప్పు తీసి గర్భగుడిలోని విగ్రహాలను కొట్టడానికి ప్రయత్నించాడు" అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ అపచారాన్ని గమనించిన భక్తులు, స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో అతడిపై దాడి చేసి, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి జాతీయత, నేపథ్యంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.