Election Commission of India: దేశవ్యాప్తంగా 'ఎస్ఐఆర్'... నేడు ఈసీ కీలక ప్రకటన
- దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ కు సిద్దమైన ఈసీ
- తొలి దశలో 10 - 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్
- వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు తొలిదశలోనే
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన చేయనుంది. బీహార్ తరహాలోనే దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధమైన ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో తొలిదశలో భాగంగా 10-15 రాష్ట్రాల్లో చేపట్టనున్న ఎస్ఐఆర్ పై ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలు తొలిదశ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ కార్యక్రమానికి రాష్ట్రాల సీఈవోలు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మేరకు సూచనలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ఎస్ఐఆర్ పై ఉన్న అనుమానాలను కమిషనర్ నివృత్తి చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో 2002-04 మధ్యకాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 20 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో నకిలీ ఓటర్లను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ వెల్లడిస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలు తొలిదశ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ కార్యక్రమానికి రాష్ట్రాల సీఈవోలు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మేరకు సూచనలు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ఎస్ఐఆర్ పై ఉన్న అనుమానాలను కమిషనర్ నివృత్తి చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో 2002-04 మధ్యకాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 20 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో నకిలీ ఓటర్లను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ వెల్లడిస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.