అడవి ఏనుగు దెబ్బకు 18 గంటలుగా నిలిచిన వాహనాలు
- కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ప్రయాణికులకు భయానక అనుభవం
- రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి పక్కనే నిల్చున్న ఏనుగు
- ముందుకు వెళ్లే దారిలేక నిలిచిపోయిన వందలాది వాహనాలు
వాహనదారుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అయితే, వారిపై అది దాడి చేయడంతో తృటిలో తప్పించుకున్నారు. చివరకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ ఏనుగు తనకు తానుగా అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో 18 గంటలపాటు నిరీక్షించిన వాహనాలు నెమ్మదిగా కదిలాయి. కాగా, ఈ ఏనుగు వల్ల వాహనాల్లో చిక్కుకుపోయిన వ్యక్తులు, టూరిస్టులు ఆహారం, నీరు లేక ఇబ్బందులకు గురయ్యారు.