KTR: వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది: కేటీఆర్
- హైడ్రా బాధితులతో కలిసి సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన కేటీఆర్
- హైడ్రా కారణంగా పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపాటు
- మరో రెండేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ వెలుగులు చూడవచ్చన్న కేటీఆర్
రానున్న ఎన్నికల అనంతరం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మరో రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం తిరిగి ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాదాపూర్లోని సున్నం చెరువు ప్రాంతానికి హైడ్రా బాధితులతో కలిసి వెళ్లారు. అక్కడ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నివాసితులతో మాట్లాడి ప్లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైడ్రా బాధితులతో కలిసి అక్కడే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇళ్లు లేకుండా చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. హైడ్రా కారణంగా హైదరాబాద్ నగరంలో ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సున్నం చెరువు బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇళ్లు లేకుండా చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. హైడ్రా కారణంగా హైదరాబాద్ నగరంలో ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సున్నం చెరువు బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.