Cancer Patient: ఇదే నా చివరి దీపావళి.. 21 ఏళ్ల యువకుడి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు!
- చివరి దశ క్యాన్సర్తో 21 ఏళ్ల యువకుడి పోరాటం
- ఇదే నా చివరి దీపావళి అంటూ రెడిట్లో భావోద్వేగ పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువకుడి ఆవేదన
- తీరని కలలతోనే వెళ్లిపోతున్నానంటూ ఎమోషనల్
- అద్భుతం జరగాలని ప్రార్థిస్తూ వెల్లువెత్తిన సందేశాలు
"నాకు బతకాలని ఉంది. ఎన్నో కలలున్నాయి. కానీ, నాకు సమయం అయిపోతోంది. బహుశా ఇదే నా చివరి దీపావళి కావొచ్చు" అంటూ చివరి దశ క్యాన్సర్తో పోరాడుతున్న 21 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. అతని ఆవేదన నెటిజన్లను తీవ్రంగా కలచివేస్తుండగా, అతను కోలుకోవాలని వేలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు.
'ట్వంటీస్ ఇండియా' అనే రెడిట్ గ్రూప్లో ఓ యువకుడు తన బాధను పంచుకున్నాడు. తాను 2023 నుంచి స్టేజ్ 4 కొలొరెక్టల్ క్యాన్సర్తో బాధపడుతున్నానని, నెలల తరబడి కీమోథెరపీ, ఆసుపత్రి చికిత్సల తర్వాత ఇక చేసేదేమీ లేదని, ఈ ఏడాది చివరి వరకు బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారని అతను తన పోస్ట్లో పేర్కొన్నాడు. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో తన బాధను అతను అక్షరాల్లో నింపాడు.
"వీధుల్లో అప్పుడే దీపావళి దీపాలు వెలుగుతున్నాయి. వీటిని నేను చివరిసారిగా చూస్తున్నాననే విషయం నన్ను కుంగదీస్తోంది. ఆ వెలుగులు, నవ్వులు, సందడిని నేను మిస్సవుతాను. నా జీవితం నిశ్శబ్దంగా ముగిసిపోతుంటే, బయట ప్రపంచం మామూలుగానే సాగిపోవడం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో వేరొకరు దీపాలు వెలిగిస్తారని, నేను కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతానని నాకు తెలుసు" అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రపంచాన్ని చుట్టిరావాలని, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, ఓ కుక్కపిల్లను పెంచుకోవాలని ఎన్నో కలలు కన్నానని, కానీ ఇప్పుడు అవన్నీ దూరమైపోతున్నాయని వాపోయాడు. "నాకు సమయం అయిపోతోందని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ ఆలోచనలన్నీ ఆవిరైపోతాయి. ఇంట్లో నా తల్లిదండ్రుల ముఖాల్లో బాధను చూడలేకపోతున్నాను. నేను నిశ్శబ్దంగా వెళ్లిపోయే ముందు నాదైన ఒక చిన్న జాడను వదిలిపెట్టాలనే ఈ పోస్ట్ పెడుతున్నా" అని రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ చూసిన వేలాది మంది నెటిజన్లు తీవ్రంగా చలించిపోయారు. ఏదైనా అద్భుతం జరిగి అతను బతకాలని ఆకాంక్షిస్తూ సందేశాలు వెల్లువెత్తాయి. "నీలో ఉన్న ధైర్యం మాటల్లో చెప్పలేనిది. నీవు ప్రతీ క్షణం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం" అని ఒకరు వ్యాఖ్యానించగా, "నీవు ఒంటరి కాదు మిత్రమా, మా ప్రార్థనలు నీకు తోడుగా ఉంటాయి" అని మరొకరు ధైర్యం చెప్పారు. ఈ పోస్ట్ జీవితం ఎంత విలువైనదో, ఎంత అశాశ్వతమైనదో గుర్తు చేస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
'ట్వంటీస్ ఇండియా' అనే రెడిట్ గ్రూప్లో ఓ యువకుడు తన బాధను పంచుకున్నాడు. తాను 2023 నుంచి స్టేజ్ 4 కొలొరెక్టల్ క్యాన్సర్తో బాధపడుతున్నానని, నెలల తరబడి కీమోథెరపీ, ఆసుపత్రి చికిత్సల తర్వాత ఇక చేసేదేమీ లేదని, ఈ ఏడాది చివరి వరకు బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారని అతను తన పోస్ట్లో పేర్కొన్నాడు. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో తన బాధను అతను అక్షరాల్లో నింపాడు.
"వీధుల్లో అప్పుడే దీపావళి దీపాలు వెలుగుతున్నాయి. వీటిని నేను చివరిసారిగా చూస్తున్నాననే విషయం నన్ను కుంగదీస్తోంది. ఆ వెలుగులు, నవ్వులు, సందడిని నేను మిస్సవుతాను. నా జీవితం నిశ్శబ్దంగా ముగిసిపోతుంటే, బయట ప్రపంచం మామూలుగానే సాగిపోవడం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో వేరొకరు దీపాలు వెలిగిస్తారని, నేను కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతానని నాకు తెలుసు" అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రపంచాన్ని చుట్టిరావాలని, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, ఓ కుక్కపిల్లను పెంచుకోవాలని ఎన్నో కలలు కన్నానని, కానీ ఇప్పుడు అవన్నీ దూరమైపోతున్నాయని వాపోయాడు. "నాకు సమయం అయిపోతోందని గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ ఆలోచనలన్నీ ఆవిరైపోతాయి. ఇంట్లో నా తల్లిదండ్రుల ముఖాల్లో బాధను చూడలేకపోతున్నాను. నేను నిశ్శబ్దంగా వెళ్లిపోయే ముందు నాదైన ఒక చిన్న జాడను వదిలిపెట్టాలనే ఈ పోస్ట్ పెడుతున్నా" అని రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ చూసిన వేలాది మంది నెటిజన్లు తీవ్రంగా చలించిపోయారు. ఏదైనా అద్భుతం జరిగి అతను బతకాలని ఆకాంక్షిస్తూ సందేశాలు వెల్లువెత్తాయి. "నీలో ఉన్న ధైర్యం మాటల్లో చెప్పలేనిది. నీవు ప్రతీ క్షణం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం" అని ఒకరు వ్యాఖ్యానించగా, "నీవు ఒంటరి కాదు మిత్రమా, మా ప్రార్థనలు నీకు తోడుగా ఉంటాయి" అని మరొకరు ధైర్యం చెప్పారు. ఈ పోస్ట్ జీవితం ఎంత విలువైనదో, ఎంత అశాశ్వతమైనదో గుర్తు చేస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు.