Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
- ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- కాకినాడ సెజ్ రైతులకు 2,180 ఎకరాల భూములు వెనక్కి
- భూముల రిజిస్ట్రేషన్కు స్టాంప్ డ్యూటీ, ఫీజులు రద్దు
- సీఎం చంద్రబాబు ఆమోదంతో రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు
- తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో 1,551 మంది రైతులకు లబ్ధి
- సీఎం చంద్రబాబుకు, మంత్రి అనగానికి పవన్ కృతజ్ఞతలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, రైతుల పక్షాన నిలుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సెజ్ కోసం సేకరించిన 2,180 ఎకరాల భూమిని తిరిగి రైతులకే అప్పగించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్, కాకినాడ సెజ్ రైతుల సమస్యను పరిష్కరిస్తానని బలంగా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జీవో జారీ చేసినా, క్షేత్రస్థాయిలో భూములు రైతులకు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి అవసరాలకు కూడా భూమిని వాడుకోలేకపోతున్నామని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పవన్, తాను అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆమోదంతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఫలితంగా, కాకినాడ సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు అప్పగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.
ఈ భూములను రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాలకు చెందిన సుమారు 1,551 మంది రైతులకు భారీ ఊరట లభించనుంది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, తన ఎన్నికల హామీ పట్ల సానుకూలంగా స్పందించి, రైతుల పక్షాన నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్, కాకినాడ సెజ్ రైతుల సమస్యను పరిష్కరిస్తానని బలంగా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జీవో జారీ చేసినా, క్షేత్రస్థాయిలో భూములు రైతులకు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి అవసరాలకు కూడా భూమిని వాడుకోలేకపోతున్నామని రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పవన్, తాను అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆమోదంతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఫలితంగా, కాకినాడ సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు అప్పగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.
ఈ భూములను రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాలకు చెందిన సుమారు 1,551 మంది రైతులకు భారీ ఊరట లభించనుంది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, తన ఎన్నికల హామీ పట్ల సానుకూలంగా స్పందించి, రైతుల పక్షాన నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.