పాకిస్థాన్ పరువు తీసిన అమెరికా.. అదంతా ఫేక్ ప్రచారమేనని క్లారిటీ
- అమెరికా నుంచి అత్యాధునిక ఏఐఎం మిసైల్స్ అందుకోబోతున్నామని పాక్ ప్రచారం
- వరుస కథనాలతో ఊదరగొట్టిన పాకిస్థాన్ మీడియా
- పాత ఒప్పందాల విడి భాగాలే.. కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడంలేదని అమెరికా క్లారిటీ
2007లో 700 ఎఫ్–16 యుద్ధ విమానాల అమ్మకం సందర్బంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విడి భాగాలను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అందజేసిన ఎఫ్-16 విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్ట్, విడి భాగాలను మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం, అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది.