Vikas: మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో తీవ్రమైన విభేదాలు నిజమే: మావోయిస్టు వికాస్
- డీజీపీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు కీలక మావోయిస్టులు
- ఆయుధాలు వదిలేయడంపై దండకారణ్యంలో విస్తృత చర్చ జరుగుతోందన్న వికాస్
- పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటాలు సహజమేనని వెల్లడి
మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలకు బలం చేకూరుస్తూ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు ముఖ్య నేతలు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగుబాటు అనంతరం వారిలో ఒకరైన కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, పార్టీలోని అంతర్గత కలహాలపై సంచలన విషయాలు వెల్లడించారు.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో తీవ్రమైన విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని వికాస్ అంగీకరించారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే అంశంపై దండకారణ్యంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరగడం కొత్తేమీ కాదని, ఇది సహజమేనని వికాస్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టులు పంతాలకు పోకుండా ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు 72 మంది ఉన్నారని, వారిలో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులేనని ఆయన వెల్లడించారు. వారంతా ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో తీవ్రమైన విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని వికాస్ అంగీకరించారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే అంశంపై దండకారణ్యంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరగడం కొత్తేమీ కాదని, ఇది సహజమేనని వికాస్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టులు పంతాలకు పోకుండా ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు 72 మంది ఉన్నారని, వారిలో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులేనని ఆయన వెల్లడించారు. వారంతా ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.