జనసేన ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ
- కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహం
- మంగళగిరిలో ఘనంగా జరిగిన వేడుక
- వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
- మామ బాలకృష్ణతో కలిసి వచ్చిన మంత్రి లోకేశ్
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కూటమి నేతలు
ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడు సందీప్, బిందు శ్రీలేఖల వివాహం నేడు జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై, నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు, మంత్రి నారా లోకేశ్ తన మామ నందమూరి బాలకృష్ణతో కలిసి ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. వేదికపైకి వెళ్లి నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సభ్యులు ప్రముఖులకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.






