మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన రేవంత్ రెడ్డి
- అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి ఇటీవల డిశ్చార్జ్ అయిన ఖర్గే
- గుండె వేగం తగ్గకుండా పేస్ మేకర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన వైద్యులు
- బెంగళూరుకు వెళ్లి ఖర్గేను పరామర్శించిన రేవంత్ రెడ్డి
ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు. పరామర్శ అనంతరం, వారి మధ్య రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.