Chiranjeevi: ఈ బంధం విడదీయరానిది.. తారల రీయూనియన్ ఫొటోలతో మెగాస్టార్

Chiranjeevi Posts Photos of 80s Stars Reunion in Chennai
  • చెన్నైలో కలుసుకున్న అలనాటి తారలు
  • చిరంజీవి, వెంకటేశ్ సహా మొత్తం 31 మంది నటులు
  • దక్షిణాదితోపాటు 80ల నాటి ఉత్తరాది నటులు కూడా హాజరు
‘నా ప్రియమైన స్నేహితులతో ప్రతీ రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుంది’ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. 80ల నాటి తారల రీయూనియన్ ఫొటోలను పంచుకుంటూ మెగస్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలని ఆయన అన్నారు. తమ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిదని చెప్పారు. అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్‌ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే.

చెన్నైలో వరదల కారణంగా గతేడాది వాయిదా పడింది. తాజగా ఈ నెల 4న దక్షిణాది, ఉత్తరాది నటులు మొత్తం 31 మంది కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకుంటూ.. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది.

ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుందని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, శరత్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, నరేశ్‌, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు పాల్గొన్నారు.
Chiranjeevi
80s actors reunion
South Indian actors
Bollywood actors
Chennai reunion party
Venkatesh
Jackie Shroff
Sarath Kumar
Jayaprada
Ramya Krishnan

More Telugu News