దగ్గు మందు తాగి ఇద్దరు చిన్నారుల మృతి.. అది సురక్షితమేనని చెప్పి, తాగిన వైద్యుడికి అస్వస్థత
- రాజస్థాన్లో దగ్గు మందు సిరప్తో ఇద్దరు చిన్నారుల మృతి
- మరో 10 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత
- ఓ ఫార్మా సంస్థకు చెందిన 22 బ్యాచ్ల సిరప్పై నిషేధం
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ఈ వివాదాస్పద సిరప్ ఇప్పటికే ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. సికార్ జిల్లా చిరానాకు చెందిన నితీశ్ (5) అనే బాలుడికి సెప్టెంబర్ 28న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఈ సిరప్ ఇచ్చారు. రాత్రి ఆ మందు తాగిన బాలుడు, ఉదయం నిద్రలేవలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు, సెప్టెంబర్ 22న మల్లా ప్రాంతంలో సామ్రాట్ జాతవ్ (2) అనే చిన్నారి కూడా ఇదే సిరప్ కారణంగా మృతి చెందాడు. జ్యోతి అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెచ్చిన ఇదే సిరప్ ఇవ్వగా, ముగ్గురూ స్పృహ కోల్పోయారు. వారిలో ఇద్దరు వాంతులు చేసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడగా, సమ్రాట్ ప్రాణాలు విడిచాడు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసన్ అనే సంస్థ సరఫరా చేసిన 22 బ్యాచ్ల దగ్గు మందు సిరప్లను తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటి పంపిణీని పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.