OPT Students: అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్.. ఇళ్లకే వచ్చి అధికారుల తనిఖీలు
- అక్రమ వలసదారుల నుంచి విద్యార్థులపైకి ట్రంప్ సర్కార్ దృష్టి
- అమెరికాలో ఓపీటీ విద్యార్థుల ఇళ్లు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
- ముఖ్యంగా స్టెమ్ ఓపీటీ విద్యార్థులే లక్ష్యంగా అధికారుల సోదాలు
- నిబంధనల ప్రకారం శిక్షణ పొందుతున్నారా? లేదా? అని ఆరా
- పత్రాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని విద్యార్థులకు నిపుణుల సూచన
- యూఎస్లో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు, 97 వేల మంది ఓపీటీలో
అమెరికాలో అక్రమ వలసదారులే లక్ష్యంగా ముందుకెళ్లిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు తన దృష్టిని అంతర్జాతీయ విద్యార్థుల వైపు మళ్లించింది. ముఖ్యంగా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద పనిచేస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు నివసిస్తున్న ఇళ్లు, హాస్టళ్లకు అధికారులు అకస్మాత్తుగా వెళ్లి తనిఖీలు చేస్తుండటంతో భారత విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
గతంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిన అధికారులు, ఇప్పుడు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఓపీటీ పొడిగింపులో ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలు చట్టబద్ధమే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా వీటిని ముమ్మరం చేయడమే ప్రస్తుత ఆందోళనకు కారణం. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కింద పనిచేసే ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ (ఎఫ్డీఎన్ఎస్) విభాగం ఈ తనిఖీలను నిర్వహిస్తోంది.
ఓపెన్డోర్స్ రిపోర్ట్ 2023-24 ప్రకారం, అమెరికాలో సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, వారిలో 97,556 మంది ఓపీటీ ప్రోగ్రామ్లో ఉన్నారు. స్టెమ్ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యాక మొత్తం మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం ఓపీటీ ద్వారా లభిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ 'ఫామ్-ఐ983'లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే సంబంధిత రంగంలో శిక్షణ పొందుతున్నారా? వారి ఎఫ్-1 వీసా స్టేటస్ చెల్లుబాటులో ఉందా? వంటి విషయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇటీవల స్టెమ్ ఓపీటీలో ఉన్న ఒక విద్యార్థి మాట్లాడుతూ, అధికారులు అకస్మాత్తుగా తన నివాసానికి వచ్చి పత్రాలు పరిశీలించారని, మరిన్ని ఆధారాలు చూపాలని కోరారని తెలిపారు. ఫ్లోరిడాకు చెందిన ఒక ఇమ్మిగ్రేషన్ అటార్నీ మాట్లాడుతూ, "ట్రంప్ ప్రభుత్వం ఈ తనిఖీలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ పత్రాలన్నింటినీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారులు వచ్చినప్పుడు కంగారు పడకుండా, ప్రశాంతంగా ఉండి వారు అడిగిన ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి" అని సూచించారు.
గతంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిన అధికారులు, ఇప్పుడు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఓపీటీ పొడిగింపులో ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలు చట్టబద్ధమే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా వీటిని ముమ్మరం చేయడమే ప్రస్తుత ఆందోళనకు కారణం. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కింద పనిచేసే ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ (ఎఫ్డీఎన్ఎస్) విభాగం ఈ తనిఖీలను నిర్వహిస్తోంది.
ఓపెన్డోర్స్ రిపోర్ట్ 2023-24 ప్రకారం, అమెరికాలో సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, వారిలో 97,556 మంది ఓపీటీ ప్రోగ్రామ్లో ఉన్నారు. స్టెమ్ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యాక మొత్తం మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం ఓపీటీ ద్వారా లభిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ 'ఫామ్-ఐ983'లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే సంబంధిత రంగంలో శిక్షణ పొందుతున్నారా? వారి ఎఫ్-1 వీసా స్టేటస్ చెల్లుబాటులో ఉందా? వంటి విషయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇటీవల స్టెమ్ ఓపీటీలో ఉన్న ఒక విద్యార్థి మాట్లాడుతూ, అధికారులు అకస్మాత్తుగా తన నివాసానికి వచ్చి పత్రాలు పరిశీలించారని, మరిన్ని ఆధారాలు చూపాలని కోరారని తెలిపారు. ఫ్లోరిడాకు చెందిన ఒక ఇమ్మిగ్రేషన్ అటార్నీ మాట్లాడుతూ, "ట్రంప్ ప్రభుత్వం ఈ తనిఖీలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ పత్రాలన్నింటినీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారులు వచ్చినప్పుడు కంగారు పడకుండా, ప్రశాంతంగా ఉండి వారు అడిగిన ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి" అని సూచించారు.