Chandrababu Naidu: తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు
- తిరుమలలో రూ.102 కోట్లతో నిర్మించిన వేంకటాద్రి నిలయం ప్రారంభం
- ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి కల్పించేలా నిర్మాణం
- టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణకు సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
- ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- గంటకు 5500 మందికి దర్శనం కల్పించాలని అధికారులకు సీఎం ఆదేశం
- ప్రసాదం తయారీలో నాణ్యత పెంచేందుకు ఏఐ ఆధారిత యంత్రాల వినియోగం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ శుభవార్త అందించింది. సామాన్య భక్తుల వసతి కష్టాలను తీర్చేందుకు, దర్శన సమయాన్ని తగ్గించేందుకు వీలుగా చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులు గురువారం ప్రారంభమయ్యాయి. రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించిన బృహత్తర వసతి సముదాయం 'వేంకటాద్రి నిలయం' (పీఏసీ-5), క్యూలైన్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక 'సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్' (ఐసీసీ) లను భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఒకేసారి 4 వేల మందికి ఉచిత బస
ముందస్తు రిజర్వేషన్ లేకుండా తిరుమలకు చేరుకునే యాత్రికుల కోసం టీటీడీ ఈ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సుమారు 4 వేల మంది భక్తులు ఎలాంటి రుసుము చెల్లించకుండా బస చేసేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ భవనంలో 16 విశాలమైన డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటల వేడినీటి సదుపాయం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
అంతేకాకుండా, ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్ట, 1400 మంది భోజనం చేసేందుకు రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా ఏర్పాటు చేశారు. వసతి సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి భవనంలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుకింగ్ కౌంటర్కు వెళ్లి, అక్కడి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓ భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందించారు.
ప్రాంగణంలోని వ్యర్థాల సేకరణ యంత్రాన్ని, పోటులో ప్రసాదం నాణ్యత పెంచేందుకు ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సార్టింగ్ యంత్రాలను కూడా వారు ప్రారంభించారు.
టెక్నాలజీతో సులభతర దర్శనం
భక్తుల రద్దీని, క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం గంటకు 4500 మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని అధికారులు వివరించగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీల సాయంతో ఆ సంఖ్యను గంటకు 5500కు పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలిపిరి వద్దే నిషేధిత వస్తువులను గుర్తించడం, రద్దీకి అనుగుణంగా హీట్ మ్యాపులు రూపొందించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుమల గిరులను 90 శాతానికి పైగా పచ్చదనంతో నింపాలని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక వీడియోలు ప్రదర్శించాలని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా తిరుమల కొండపై భద్రత, పారిశుధ్యం, భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.

ఒకేసారి 4 వేల మందికి ఉచిత బస
ముందస్తు రిజర్వేషన్ లేకుండా తిరుమలకు చేరుకునే యాత్రికుల కోసం టీటీడీ ఈ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సుమారు 4 వేల మంది భక్తులు ఎలాంటి రుసుము చెల్లించకుండా బస చేసేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ భవనంలో 16 విశాలమైన డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటల వేడినీటి సదుపాయం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
అంతేకాకుండా, ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్ట, 1400 మంది భోజనం చేసేందుకు రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా ఏర్పాటు చేశారు. వసతి సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి భవనంలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుకింగ్ కౌంటర్కు వెళ్లి, అక్కడి విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓ భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందించారు.
ప్రాంగణంలోని వ్యర్థాల సేకరణ యంత్రాన్ని, పోటులో ప్రసాదం నాణ్యత పెంచేందుకు ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సార్టింగ్ యంత్రాలను కూడా వారు ప్రారంభించారు.
టెక్నాలజీతో సులభతర దర్శనం
భక్తుల రద్దీని, క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం గంటకు 4500 మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని అధికారులు వివరించగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీల సాయంతో ఆ సంఖ్యను గంటకు 5500కు పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలిపిరి వద్దే నిషేధిత వస్తువులను గుర్తించడం, రద్దీకి అనుగుణంగా హీట్ మ్యాపులు రూపొందించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుమల గిరులను 90 శాతానికి పైగా పచ్చదనంతో నింపాలని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక వీడియోలు ప్రదర్శించాలని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా తిరుమల కొండపై భద్రత, పారిశుధ్యం, భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
