Chandrababu Naidu: అమరావతి సచివాలయం సమీపంలో మరికొద్ది సేపట్లో మెగా డీఎస్సీ ఉత్సవ్
- విజేతలకు నియామక పత్రాలు అందించనున్న సీఎం చంద్రబాబు
- ప్రాంగణంలో పండుగ వాతావరణం.. టీచర్ల కోలాహలం
- తమ కలలు నెరవేరాయంటూ అభ్యర్థుల ఆనందోత్సాహాలు
- హాజరుకానున్న మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్న నూతన ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయ ప్రాంగణం నూతన ఉపాధ్యాయుల కోలాహలంతో సందడిగా మారింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'మెగా డీఎస్సీ ఉత్సవ్' మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుండటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కొలువు సాధించిన ఆనందంతో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, మెగా డీఎస్సీలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు స్వయంగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నారు. తమ చిరకాల స్వప్నం నెరవేరుతున్న ఈ క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభ్యర్థులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తమ కలలు సాకారమవుతున్నందుకు పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ నిరీక్షణకు తెరదించి, కొలువుల పండుగను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత తీరనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, మెగా డీఎస్సీలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు స్వయంగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నారు. తమ చిరకాల స్వప్నం నెరవేరుతున్న ఈ క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభ్యర్థులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తమ కలలు సాకారమవుతున్నందుకు పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ నిరీక్షణకు తెరదించి, కొలువుల పండుగను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత తీరనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.